*ఒక మనిషి చనిపోయాడు.*
*దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది చుట్టూ చూశాడు....*

చేతిలో పెట్టెతో దేవుడుతనదగ్గరకు
వచ్చాడు.
_చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.!!_

*దేవుడు:*

మానవా..నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద.

*మనిషి:*

అయ్యో ఇంత త్వరగానా?
నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు:

తప్పదు నాయనా!
నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది.

మనిషి:

నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు:

నీకు చెందినవే ఉన్నాయి... అవి నువు కూడబెట్టుకునీ , సంపాదించు కొన్నవే...

మనిషి:

నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు:

అవెప్పటికీ నీవి కావు.
అవన్నీ భూమివే.
ఇక్కడే ఉంటాయి

మనిషి:

పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు:

కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి:

అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు:

అవి పరిస్థితులవి నీవి కావు

మనిషి:

నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు:

వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి:

నా భార్య, బిడ్డలునా?

దేవుడు:

వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి:

అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు:

తప్పు, నీ శరీరం థూళికి చెందినది, మట్టిలో పడుతుంది.

మనిషి:

స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు:

ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి:

ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు...

కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె ఖాళీగాఉంది.

మనిషి:

కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.

బతికున్నంత కాలం నా వాళ్లు,
🌷అవన్నీ నావే,
🌷ఇవన్నీ నాకే అని ఆశతో,
🌷ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి:

స్వామీ చివరగా అడుగుతున్నాను...

*నాది అనేది ఏమైనా ఉందా అసలు?*

దేవుడు:

ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, భగవన్మామ స్మరణ చేయాలి... పశ్చాతాపులను క్షమించాలి.

తోటివారి నుంచి మనకి
సంక్రమించే భావాలను ఆనందించాలి

మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి...

సర్వే జనా సుఖినోభవంతు..

🙏🙏🙏 🙏🙏

యద్భావం తద్భవతి